ఈ ఇద్దరిలో ఒకరు అవుట్?
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమౌతోంది భారత క్రికెట్ జట్టు. ఇటీవలే ఈ టోర్నమెంట్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. టీ 20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లోనూ ఇదే జట్టు ఆడుతుంది. ఈ జట్టులో వైస్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఎంపిక అయ్యాడు. వైస్ కేప్టెన్ గా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు.
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 55 మ్యాచ్లు ఆడతాయి. భారత పర్యటన కోసం న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది కూడా. టీ20లకు మిచెల్ శాంట్నర్, వన్డేలకు మైఖేల్ బ్రేస్వెల్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. బ్లాక్ క్యాప్స్ జనవరిలో భారత్తో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లలో ఆడనుంది. గాయం నుంచి కోలుకున్న కైల్ జెమీసన్ రెండు ఫార్మాట్లలోనూ చేరాడు. మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. కేన్ విలియమ్సన్, జాకబ్ డఫ్ఫీ, రచిన్ రవీంద్ర గాయాల కారణంగా దూరం అయ్యారు.

టీ20 వరల్డ్ కప్ ముందు జరగబోయే ఈ సిరీస్ భారత్ కు ప్రతిష్ఠాత్మకం. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో కొన్ని భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుంది. ఇదివరకు ఆయన పదవీ కాలాన్ని 2026 జూన్ వరకు పొడిగించింది బీసీసీఐ. 2023 జులైలో అగార్కర్.. చీఫ్ సెలెక్టర్ గా పగ్గాలు అందుకున్నాడు. ఆయన నేతృత్వంలో భారత జట్టు 2023 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్కు చేరింది.
అలాగే 2024లో ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది. ఈ విజయాలే ఆయన పదవీకాలాన్ని పొడిగించడానికి బీసీసీఐకి ప్రధాన కారణాలు. దీని తర్వాత పొడిగింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చితే తప్ప అజిగ్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించకపోవచ్చు. కొత్త చీఫ్ సెలెక్టర్ ను ఎంపిక చేయడానికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పరిస్థితే వస్తే టీమిండియా మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్ లేదా ప్రజ్ఞాన్ ఓఝా చీఫ్ సెలెక్టర్ గా ఎంపికకావచ్చని తెలుస్తోంది.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications