టెస్ట్ కెప్టెన్సీపై జడేజా రియాక్షన్ ఇదే..!!
భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ఫార్మాట్లో దిగ్గజంగా కొనసాగుతున్నప్పటికీ, రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత టెస్టుల్లో కెప్టెన్గా లేదా వైస్ కెప్టెన్గా అతన్ని ఎంపిక చేయడానికి సెలక్షన్ కమిటీ వెనకడుగు వేసింది. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ తరపున కీలక ప్రదర్శన చేసిన తర్వాత, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే సమయం తనకు ముగిసిందని జడేజా అంగీకరించాడు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్కు రెండో ప్రాధాన్య ఆటగాడిగా ఉన్నప్పటికీ, జడేజా 137 బంతుల్లో విలువైన 89 పరుగులు చేసి భారత్ పటిష్ట స్థానంలో నిలబడేందుకు దోహదపడ్డాడు. 15 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో మూడోసారి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జడేజాను కెప్టెన్సీ గురించి అడుగగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ''లేదు, ఆ సమయం ఇప్పుడు లేదు’’ అని చిరునవ్వుతో చెప్పాడు.
ప్లాన్ గురించి ముందుగానే చెప్పుకున్నాం
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జడేజా గిల్ బ్యాటింగ్ గురించి కూడా మాట్లాడాడు. "నిజాయితీగా చెప్పాలంటే, గిల్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ లో కెప్టెన్ లాగా కనిపించడం లేదు. అతనికి అదనపు బాధ్యత అప్పగించారు. అతను ప్రతిదీ తనతో తీసుకువెళుతున్నాడు. అతని బ్యాటింగ్లో నాకు అలాంటిదేమీ అనిపించడం లేదు. ఈరోజు కూడా దురదృష్టవశాత్తు బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. కానీ ఈరోజు అతను ఈ ఇన్నింగ్స్లో అవుట్ అవుతాడని నేను అనుకోలేదు. అతను చాలా బాగా ఆడాడు. మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భాగస్వామ్యం గురించి మాట్లాడుకున్నాం. మనం ఒక పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పుతామని ఒకరితో ఒకరం చెప్పుకున్నాం" అని జడేజా అన్నాడు.

టీమిండియా పటిష్ట స్థితిలో ఉందంటే అందుకు కారణం జడేజా గిల్తో కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జోష్ టంగ్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు జడేజా ఇన్నింగ్స్కు తెరపడింది . అదనపు వేగం, బౌన్స్తో జడేజా తొందరపడి వికెట్ కీపర్ జామీ స్మిత్కు క్యాచ్ ఇచ్చాడు. జడేజా నిష్క్రమణ తర్వాత గిల్ వాషింగ్టన్ సుందర్తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని మరింత బలహీనపరిచాడు. జో రూట్ 42(103) పరుగుల వద్ద సుందర్ను అవుట్ చేయగా, భారత్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచిన గిల్ 269 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ను ముగించాడు. దీంతో భారత్ 587 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
దీనికి సమాధానంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ ధాటికి విలవిల్లాడింది. వీరిద్దరూ టాప్ ఆర్డర్ను దెబ్బతీయడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. బెన్ డకెట్ (0), ఒల్లీ పోప్ (0), జాక్ క్రాలీ (19)లను అవుట్ చేశారు. జో రూట్, హ్యారీ బ్రూక్ కష్టపడి బ్యాటింగ్ చేసి అజేయంగా 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ను ఆదుకున్నారు. దీంతో రోజు చివరికి ఇంగ్లాండ్ 77/3తో నిలిచింది.
మూడో రోజు ఆటలో అనుసరించాల్సిన వ్యూహాన్ని జడేజా వివరించాడు. "మేము చాలా దూరం ఆలోచించడం లేదు. రేపు భోజన విరామానికి ముందు 2-3 వికెట్లు తీయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఆటలో ముందుంటాం. ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు. గతంలో క్రికెట్లో పెద్ద భాగస్వామ్యాలు ఉన్నాయి. మేము ఆటను తేలికగా తీసుకోము. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఆడాము. భారతదేశానికి అనుకూలమైన ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.
మొత్తానికి రవీంద్ర జడేజా కెప్టెన్సీ రేసులో లేనని చెప్పకనే చెప్పాడు. జట్టులో యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందిస్తూ, తన ఆటపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు. జడేజా రాబోయే మ్యాచుల్లో రాణించి జట్టు విజయానికి తనవంతు సహకారం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications