Ind-SA T20I: సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడేది వీళ్లే..! గిల్, హార్దిక్ రిటర్న్స్..!
భారత్ తో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు టీ20ల వంతు వచ్చింది. రేపు కటక్ లో జరిగే తొలి టీ20తో ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కాబోతోంది. దీంతో రేపు జరిగే ఆరంభ మ్యాచ్ కోసం టీమిండియాలో ఆడే 11 మంది ఆటగాళ్లను జట్టు మేనేజ్ మెంట్ ఖరారు చేసింది. ఇందులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్టు సిరీస్ వైట్ వాష్ తర్వాత వన్డే సిరీస్ ను అతి కష్టం మీద గెల్చుకున్న భారత్ కు ఈ సిరీస్ కీలకంగా మారింది.
రేపు కటక్ లో జరిగే తొలి టీ20 కోసం మేనేజ్ మెంట్ ఖరారు చేసిన జట్టులో రెగ్యులర్ వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న వీరిద్దరూ కోలుకోవడంతో తిరిగి తీసుకున్నారు. ఈ ఏడాది ఆసియా కప్ సమయంలో పాండ్యా గాయంతో ఫైనల్కు దూరమయ్యాడు. అలాగే గిల్ మెడ గాయం కారణంగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డేలకూ దూరంగా ఉన్నాడు. తాజాగా ఫిట్ నెస్ సాధించాడు.

కటక్ టీ20లో గిల్, అభిషేక్ శర్మ జోడీ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్ లో వస్తాడు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ నాలుగో స్ధానంలో రానున్నాడు. ఆ తర్వాత సంజూ శ్యాంసన్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బౌలింగ్ విషయానికొస్తే ఫామ్ తో ఇబ్బందులు పడుతున్న పేసర్ హర్షిత్ రాణాను టీ20ల నుంచి తప్పించారు. వన్డేలకు రెస్ట్ ఇచ్చిన బుమ్రాతో పాటు అర్ష్ దీప్ పేస్ దాడి ఆరంభిస్తారు. కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ రూపంలో స్పిన్నర్లు అందుబాటులో ఉంటారు.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications