IPL 2024 Playoffs: వర్షం వల్ల ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్ లు ఆగినా, రద్దయినా లెక్క ఇలా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 62 మ్యాచ్ లు జరిగితే వాటిలో అత్యధిక మ్యాచ్ లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయాయి. అయితే కొన్ని మ్యాచ్ లకు మాత్రం ఆకస్మిక వర్షం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయా మ్యాచ్ లు తాత్కాలికంగా నిలిచిపోవడం, లేక రద్దు కావడం కూడా జరిగిపోయాయి. మరి ఇప్పుడు ప్లే ఆఫ్ దశలో ఇలా జరిగితే ఫలితాలను ఎలా తేల్చబోతున్నారు, పాయింట్ల కేటాయింపు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా రేపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగే తొలి క్వాలిఫయర్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పోటీ పడనుంది. అలాగే ఎల్లుండి ఇదే స్టేడియంలో జరిగే రెండో క్వాలిఫయర్ లో రాయలల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ ల తర్వాత ఎలిమినేటర్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లలో ఏదైనా ఆకస్మిక వర్షం కారణంగా ఆగిపోవడమూ, రద్దు కావడమూ జరిగితే ఫలితం తేల్చేందుకు రూల్స్ ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ రూల్ 13.7.3 ప్రకారం ఆట మధ్యలో నిలిచిపోయినా, రద్దు చేయాల్సి వచ్చినా దీన్ని ముగించడానికి అదనంగా 120 నిమిషాలు లేదా రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఇది ఇప్పటివరకూ జరిగిన లీగ్ మ్యాచ్ లకు కేటాయించిన గంటకు మరో గంట అదనం అన్నమాట. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా, మధ్యలో అంతరాయం ఏర్పడినా ముందుగా 60 నిమిషాల అదనపు సమయం వాడుకోవచ్చు. ఆ తర్వాత టైమ్ అవుట్లకు కేటాయించిన సమయం, ఇన్నింగ్స్ మార్పు కోసం ఇచ్చిన టైమ్ కూడా వాడుకోవచ్చు. తద్వారా ఫలితం తేల్చాల్సి ఉంటుంది.
ఇలా అదనపు సమయం వెసులుబాటు ద్వారా కూడా మ్యాచ్ ఫలితం తేలకపోతే అప్పుడు రిజర్వ్ డే ఉంటుంది. వాటిలో మ్యాచ్ కొనసాగిస్తారు. గతంలో ఐపీఎల్ పైనల్ మ్యాచ్ కు మాత్రమే ఇలా రిజర్వ్ డే ఉండేది. కానీ ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్స్ లో భాగంగా జరిగే నాలుగు మ్యాచ్ లకు కూడా రిజర్వు డేను ఇచ్చారు. దీంతో ఎలాగైనా ఫలితాలు తేల్చేలా చూస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications