IPL 2026: RCB కొనుగోలు రేసులో బిలియనీర్ ? చరిత్ర చూడని రేటు..!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత బ్రాడింగ్ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు తాజాగా ఎన్నాళ్లుగానో తమను ఊరిస్తున్న తొలి టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ జట్టు యజమానిగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ దీన్ని అమ్మేయాలని నిర్ణయించింది. దీంతో పోటీ మొదలైంది. ఇప్పుడు ఈ జట్టును కైవసం చేసుకునేందుకు కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీఈవో ముందువరుసలో ఉన్నారు.
కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను కొనుగోలు చేయడానికి రాబోయే కొన్ని నెలల్లో "బలమైన మరియు పోటీ" బిడ్ వేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్సీబీ యజమాని అయిన డయాజియో నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ .. ఈ ఫ్రాంచైజీని విక్రయించడానికి $2 బిలియన్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

Over the next few months, will be putting in a STRONG and COMPETITIVE bid for @RCBTweets, one of the best teams in the IPL.
— Adar Poonawalla (@adarpoonawalla) January 22, 2026
ప్రస్తుతం ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయడానికి భారీగానే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ దీని రేటును 2 బిలియన్ డాలర్లకు పెంచేసినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం ఇది 18 వేల కోట్లకు పైమాటే. ఇప్పటివరకూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం పెట్టిన అతిపెద్ద పెట్టుబడి 7090 కోట్లు. దీన్ని లక్నో సూపర్ జెయింట్స్ కోసం గోయెంకా గ్రూప్ పెట్టింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలుకు 18 వేలకోట్లు పెడితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద బేరం ఇదే అవుతుంది. ఇది ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన సింగిల్-టీమ్ ఆస్తులలో ఒకటిగా మారుతుంది. ఈ అమ్మకాన్ని పర్యవేక్షించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిటీని లావాదేవీ సలహాదారుగా నియమించినట్లు నివేదికలు చెప్తున్నాయి.
-
బెంగళూరుకు భారీ వరాల మూట- కర్ణాటక బడ్జెట్ హైలైట్స్ -
పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్లు అసెంబ్లీ ప్రకటించిన సీఎం -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications