పాకిస్థాన్ టీం కొంప ముంచిన హైదరాబాద్ బిర్యానీ - మైండ్ బ్లాక్..!!
క్రికెట్ అభిమానులకు పండుగ మొదలైంది. మరి కొద్ది గంటల్లో ప్రపంచ కప్ సమరం ఆరంభం అవుతోంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లు చివరి వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రపంచ కప్ మ్యాచులు ఏ స్థాయిలో ఉంటాయో ముందే ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సమయంలోనే భారత్ చిరకాల ప్రత్యర్ధి..దాయాది టీం పాకిస్థాన్ కు హైదరాబాద్ లో అడుగు పెట్టిన సమయం నుంచి అదిరిపోయే అతిధ్యం అందుతోంది. కానీ, వరుసగా వార్మప్ మ్యాచుల్లో ఓడిపోయారు. ఇందుకు అసలు కారణం మాత్రం కామెంట్రేటర్లకు మైండ్ పోయేలా చేసింది.
పాక్ టీం ఫిధా : భాగ్యనగరంలో తమకు అందిన గ్రాండ్ వెల్కమ్ కు పాకిస్థాన్ టీం ఫిదా అయింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి హోటల్ కు చేరుకొనే వరకూ స్థానికుల నుంచి వచ్చిన స్పందిన పాకిస్థాన్ మీడియాలో నూ హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఏడేళ్ల తరువాత భారత్ కు అందునా...మినీ భారత్ కు మరోరూపంగా నిలిచే హైదరాబాద్ లో పాకిస్థాన్ టీంకు విడిది స్పెషల్ మెమోరీగా మారిపోతోంది. ఇక్కడ వార్మప్ మ్యాచ్ లతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగానే పాకిస్థాన్ ప్రపంచ కప్ తో తొలి రెండు మ్యాచ్ లు ఆడనుంది. అగ్రశ్రేణి టీంల్లో సెమీస్ కు చేరే టీంల్లో ఒకటిగా అంచనాల్లో నిలిచిన పాకిస్థాన్ రెండు వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిపోయింది.

బిర్యానీ ఓడించింది : పాకిస్థాన్ రెండు మ్యాచ్ ల్లోనూ ఓటిమికి వారి ఆట తీరు మాత్రమే కారణం కాదు. ఇక్కడ హైదరాబాదీ స్పెషల్ రీజన్ మరొకటి ఉంది. ఈ విషయాన్ని స్వకంగా పాకిస్థానం వైస్ కెప్టన్ షాదాబ్ ఖాన్ బయట పెట్టాడు. పాకిస్థాన్ భారీ అంచనాలతో ప్రపంచ కప్ కు సమాయత్తం అవుతున్న సమయంలో రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ ఓడటానికి కారణం హైదరాబాద్ బిర్యానీయేనని చెప్పుకొచ్చాడు. భారత్ కు వచ్చిన సమయం నుంచి హైదరాబాద్ లోనే ఉంటూ..బిర్యానీ తింటూ ప్లేయర్లు బాగా బద్దకంగా తయారయ్యారని అంగీకరించాడు. ఆ బిర్యానీ ఎఫెక్ట్ తో గ్రౌండ్ లో కదలికలు సరిగ్గా లేవంటూ కామెంట్ చేసాడు. సరాదాగా ఈ కామెంట్ చేస్తూనే..షాదాబ్ ఉన్న విషయమే చెప్పాడంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సమరానికి సై : ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ లో చివరి వరకు పోరాటం చేసిన పాకిస్థాన్ చివర్లో తడబడింది. ప్రపం కప్ ముందు వార్మప్ మ్యాచ్ ల ఫలితం కంటే..సిసలైన సమరానికి సిద్దం కావటమే అసలు లక్ష్యమని షాదాబ్ చెప్పుకొచ్చాడు. తమ ఆట బాగుందని..ఫలితం మాత్రం తమ చేతుల్లో లేదన్నాడు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ తో, 10న శ్రీలంకతో పాకిస్థాన్ తల పడనుంది. ఇక ఆసీస్ తో ఓటమి తరువాత హైదరాబాద్ బిర్యానీ గురించి షాదాబ్ చేసిన కామెంట్స్ తో కామెంట్రేటర్స్ కు మైండ్ బ్లాక్ అయింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ కప్ సమయంలో పాకిస్థాన్ టీం కు హైదరాబాద్ బిర్యానీ అందకుండా చూడంటంటూ కామెంట్స్ చేస్తూ..అభిమానులు సందచి చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications