T20 World Cup సెమీ ఫైనలిస్టులు వీరే..! గ్రోక్ షాకింగ్ జోస్యం..!
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) గ్రూప్ స్టేజ్ ను దాటి సూపర్ 8స్టేజ్ కు చేరుకుంది. ఇవాళ జరిగే సూపర్ 8 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 మ్యాచ్ ఉంది. ఇలా సూపర్ 8 స్టేజ్ లో ఉన్న రెండు గ్రూపుల్లో టాప్ 2గా నిలిచిన నాలుగు జట్లకు సెమీస్ బెర్తులు ఖరారవుతాయి. అయితే ఇప్పటికే సెమీస్ బెర్తులపై పలు అంచనాలు వెలువడుతుండగా.. తాజాగా ఏఐ గ్రోక్ కూడా తన అంచనాలను చెప్పేసింది.
సూపర్ 8 గ్రూప్ ఏ-లో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్-బీలో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. వీటిలో సెమీస్ కు ఏయే జట్లు చేరతాయన్న దానిపై గ్రోక్ ను ఎక్స్ లో ఓ యూజర్ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన గ్రోక్.. గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు చేరే రెండు జట్లతో పాటు గ్రూప్ బీ నుంచి సెమీస్ కు అర్హత సాధించే మరో రెండు జట్లను తేల్చేసింది. అయితే ఇందులో ఓ షాకింగ్ అంచనా ఉంది.

Hey @grok predict your Semi-final Team's T20 World Cup 2026 pic.twitter.com/xSJXnGFfmR
— D.S. Bhati (@DSCricinfo789) February 21, 2026
గ్రోక్ ప్రకారం సూపర్ 8లో గ్రూప్ ఏ నుంచి భారత్, వెస్టిండీస్ జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయట. అలాగే గ్రూప్ బీ నుంచి పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయట. ఈ లెక్కన భారత్, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ అర్హత సాధించే అవకాశం ఉందని గ్రోక్ తేల్చేసింది. అయితే ఇందులో విచిత్రంగా ఆతిథ్య శ్రీలంక పేరు లేకపోవడం, సంచలనాల జింబాబ్వే పేరు కూడా లేకపోవడం, అదే సమయంలో పాకిస్తాన్ పేరు ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇవే అంశాల్నిగ్రోక్ ను యూజర్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఎందుకు సెమీస్ చేరుతుందో గ్రోక్ ఓ విశ్లేషణ కూడా ఇచ్చింది. పాకిస్తాన్ పేస్ అటాక్, బ్యాటింగ్ ఆర్డర్ లోతు ఇందుకు కారణాలని తెలిపింది. ఆసీస్ పై తాజాగా పాకిస్తాన్ సాధించిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ ను కూడా గుర్తు చేసింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications