అవినీతి వికేంద్రీకరణ
హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనసహజ లక్షణాన్ని చక్కగాప్రదర్శించుకుంటున్నది. ఒక్కసారి సచివాలయానికి వెళ్ళిచూస్తేతెలుగుదేశం ప్రభుత్వానికి ప్రస్తుతసర్కారుకు ఉన్న తేడాలు స్పష్టంగా కన్పిస్తాయి.చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి సెంట్రలైజ్డ్గా ఉండేది.ఇప్పుడు జరుగుతోంది.
అప్పుడూ ఇప్పుడూఅవినీతి వాస్తవం. దాని రూపంలోనే మార్పు ఉంది.కాంట్రాక్టుల మంజూరు, బదిలీల విషయంలో మంత్రులకుస్వేచ్ఛ ఉండడంతో ముఖ్యమంత్రి పేషీతో సంబంధంలేకుండా లావాదేవీలు చకచకాసాగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడుహయాంలో మంత్రులు డమ్మీలుగాఉండేవారు. మొత్తం పాలన యంత్రాంగాన్నిచంద్రబాబు నాయుడి పేషీ నియంత్రించేది. రోడ్లుభవనాల శాఖలోఇటీవల జరిగిన ఎస్ఇల బదిలీల్లో డబ్బు పెద్దఎత్తున చేతులు మారినట్టు వార్తలు వస్తున్నాయి.మునిసిపల్ శాఖ కూడా అంతే.
మంత్రులకువిశృంఖల స్వేచ్ఛ ఇవ్వడానికి ముఖ్యమంత్రివైఎస్ సుముఖంగా లేనప్పటికీ ఆయనఈ విషయంలో నిస్సహాయుడు. టిఆర్ఎస్ మంత్రుల మీదఆయనకు సహజంగానే నియంత్రణ ఉండదు. మిగితామంత్రులను ఆయన లోపాయికారీగా హెచ్చరిస్తున్నప్పటికీ జరగవలసినవిమంత్రుల స్ధాయిలో జరిగిపోతున్నాయనిసచివాలయం అధికారవర్గాలు తెలిపాయి.
ఇలా ఉండగాఎమ్మెల్యేల కార్యకలాపాలపై సిఐడి నిఘాఉంది. అక్రమార్జనలో వీరు విశృంఖంలంగావ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి,ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నభయం సిఎంకు ఉంది. అందుకే ఆయనఎమ్మెల్యేల మీద నిఘా పెట్టడమే కాక ఆవార్త మీడియాలో వచ్చేలా చేశారు. చంద్రబాబునాయుడు హయాంలోపైరవీకారులు చాలా పెద్ద వాళ్లుఉండేవారు. ఇప్పుడు రాయలసీమకు చెందిన పంచెకట్టుచోటా నాయకులంతాహైదరాబాద్ హోటళ్ళలో బసచేసి పైరవీలుచేస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ అవినీతినిరాఘాటం. ప్రభుత్వాలు మారాయి, అవినీతిఅలాగే ఉంది.
కాంగ్రెస్-టిఆర్ఎస్
కటీఫ్?
సోదరహాసం
ఐటీమీద
వైఎస్
దృష్టి
త్తెకాలపు
సత్తెన్న
కప్పల
తక్కెడ
మూడోపవర్ఫుల్
లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ
ఇంటిదొంగలేనా?
మంద
భాగ్యనగరం
తెలంగాణకు
ఎర్ర
జెండా
ఛానళ్ళా?
చేపల
చెరువులా?
టిఆర్ఎస్లో
ముసలం?
వార్
బహుముఖ
విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక
వ్యూహం!
వైఎస్
అసహనం