కదిలిన మానవత
హోంపేజి టాక్ ఆఫ్ టుడే జనరల్ Thuesday, May 27 2004
హైదరాబాద్:రాష్ట్రంలో రైతులఆత్మహత్యలు పెరుగుతున్న కొద్దీ వివిధ వర్గాల ప్రజల్లోఆందోళన అధికమవుతోంది. ఆత్మహత్యల పాల్పడిన రైతులకుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర పోలీసు అధికారులసంఘం గురువారం రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది.పోలీసులు మానవతతో స్పందించడం విశేషం. రైతు కుటుంబాలనుఆదుకునేందుకు గాను ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక రోజువిరాళం ఇవ్వాలని ఆర్టీసీలోని ఒక కార్మిక సంఘం నిర్ణయించింది.
రైతుల ఆత్మహత్యల మీద చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పందించని ఉద్యోగులు ఇప్పుడుఎందుకోగానీ ముందుకు వస్తున్నారు. మానవత్వానికిరాజకీయాలతో సంబంధం లేకపోయినా ఈ మార్పు ఎందుకు వచ్చిందోతెలియడం లేదు. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రిసహాయనిధికి మొదట విరాళం ప్రకటించింది పంచాయితీరాజ్ఉద్యోగుల సంఘం. ఆర్టీసీ, పోలీసు సిబ్బంది కూడా అదే బాటలొ నడవడంతోమరిన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మానవత్వంతో ముందుకు వచ్చేఅవకాశం ఉంది.
రైతుల ఆత్మహత్యలకు కారణాల మీదనివారణ చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీదఅధ్యయనం చేయించాల్సిన అవసరం ఉంది.
- కులం లెక్కలు ఎంత కరెక్టు?
- కాంగ్రెస్లో ఇది మామూలే!
- వైఎస్కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
- ఎవరు గొప్ప?
- ఆచితూచి అడుగులు
- సవాళ్ళు ఎన్నో...