బాబు చేయనిది,కృష్ణ చేసింది...
హోంపేజి టాక్ ఆఫ్ టుడే తెలుగుదేశం Friday, April 30 2004
హైదరాబాద్:పార్టీలు వేరైనా కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎంకృష్ణకు, చంద్రబాబు నాయుడికి చాలా పోలికలున్నాయి.ఇద్దరూ హైటెక్ ముఖ్యమంత్రులు. మధ్యప్రదేశ్ముఖ్యమంత్రి దిగ్విజయసింగ్ ఓడిపోయాకకృష్ణకు, బాబుకు టెన్షన్ పట్టుకుంది. అభివృద్ధినిఎజెండా చేసుకుని ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బతప్పదేమోనన్న అనుమానం వీరికిఏర్పడింది.
కానీఒక నెలరోజుల క్రితం కర్ణాటకలో ఒకవిశేషం జరిగింది. లాప్టాప్ లో అభివృద్ధి గ్రాఫులుచూసుకుంటూ కూర్చుంటే లాభం లేదని కృష్ణసలహాదారులు చెప్పారు. వెంటనే ప్రజాకర్షకపథకాలు పెట్టకపోతే ఓడిపోతానన్న భయంపట్టుకున్న ఆయన పేదలకు కిలో బియ్యంమూడున్నరకే ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు.అంతే కాదు నిరుద్యోగులకు నెలకు ఐదువందలరూపాయల భృతి ఇస్తామని వాగ్దానం చేశారు.ఈ రెండు వాగ్దానాలు కృష్ణ విజయావకాశాలనుగణనీయంగా మెరుగుపరిచాయి. కర్ణాటకలోఅత్తెసరు మెజార్టీతో కృష్ణ బయటపడే అవకాశముందనిఎగ్జిట్ పోల్స్లో తేలింది.
తెలుగుదేశంమేనిఫెస్టోలో కూడా ఇటువంటి ప్రజాకర్షకపథకాలను జోడించాలని కొందరు సూచించినాఉచిత విద్యుత్ అసాధ్యమని వాదిస్తున్నతాము ఎటువంటి ప్రజాకర్షక పథకంప్రకటించినా జనం నమ్మరని మరో తెలుగుమేధావి వారించారు. ఒకవేళ అటువంటిపథకాలను తెలుగుదేశం మేనిఫెస్టోలోచేర్చిఉంటే చంద్రబాబు నాయుడికి ఇంతగడ్డు పరిస్ధితి వచ్చి ఉండేది కాదేమో.
ఇటీవలికథనాలు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్కుఅసమ్మతి బ్రేక్లు
-
చిరంజీవిరహస్య
ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం