ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
హైదరాబాద్:అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)తదుపరి అధ్యక్షులుగా డాక్టర్ గవ్వా చంద్రారెడ్డిఎన్నికయ్యారు. డాక్టర్రెడ్డి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు. ఆయన గత పన్నెండేళ్ళుగాఆయన ఇండియానాలోని టెర్రి హాట్లో ప్రాక్టీసుచేస్తున్నారు. లాస్ వేగాస్లో సమావేశమైన ఆటాట్రస్టీలు,కార్యవర్గ సభ్యులు డాక్టర్ రెడ్డిని ఆటాఅధ్యక్షుడిగా (2005-2007) ఎన్నుకున్నారు. ఈఏడాది మధ్యలో జరుగనున్న ఆటామహాసభల్లో డాక్టర్ రెడ్డి పదవీ బాధ్యతలుస్వీకరిస్తారు.
ఆటాసంస్ధను బలోపేతం చేయడానికి డాక్టర్రెడ్డి పది సూత్రాల ప్రణాళికనుప్రకటించారు.
- ఆటానుతదుపరి తరం వరకు తీసుకెళ్ళడం
- ఐకమత్యతకుకృషి
- టీంవర్క్తో,సలహాదారులతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేయడం
- ప్రవాసాంధ్రులకు,రాష్ట్రంలోని తెలుగు వారికి వినూత్న రీతిలోసహాయపడడం
- అమెరికన్లుగాఉంటూనే తెలుగు జాతి సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవడం
- ఆటాసంస్ధను అభివృద్ధి చేయడం
- ఇన్ఫర్మేషన్, కమ్యూనిషన్ల అభివృద్ధి
- ఔదార్యతనుప్రబోధించడం, పెంపొందించడం
- గ్రామాన్ని దత్తత తీసుకుని, మాతృదేశానికిసేవ చేయడం
ఆటాతదుపరి అధ్యక్షులు డాక్టర్ గవ్వా చంద్రారెడ్డి 2004చికాగో ఆటా సదస్సులోనేషనల్ కన్వీనర్గా ఉన్నారు. ఆయనభార్య పద్మ, కుమార్తెలు మానస, మాధురి,కుమారుడు నితిన్తో కలిసి జీవిస్తున్నారు. డాక్టర్ రెడ్డి ఇండియాలోనరసమ్మ మెమోరియల్ హెల్త్ అండ్ఎడ్యుకేషనల్ సొసైటీకి వ్యవస్ధాపకఅధ్యక్షులు. ఆధ్యాత్మిక పుస్తకాలు,కవిత్వం చదవడం, గోల్ఫ్ ఆడడంఆయన హాబీలు.
ఆటా కొత్తకార్యవర్గం
మోహన్మల్లం, అధ్యక్షుడు
చంద్రారెడ్డి గవ్వా, ప్రెసిడెంట్ ఎలక్ట్
శ్యామ్యల్లంరాజు, కార్యదర్శి
దామోదర్రెడ్డి దోనూర్, సంయుక్త కార్యదర్శి
చంద్రశేఖర్పి రెడ్డి, కోశాధికారి
హరనాథ్ పులిచర్ల, సంయుక్త కోశాధికారి
జిఎల్ఎన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
మాధవరెడ్డి,ఆఫీస్ కోఆర్డినేటర్
డి. ద్వారకానాథ్ రెడ్డి, పద్మజా రెడ్డిఓవర్సీస్ కోఆర్డినేటర్లు
బాధ్యతలుస్వీకరించిన కొత్త ట్రస్టీలు:
కృష్ణబాపట్ల, రావ్ దలువాయ్, దామోదర్రెడ్డి దోనూర్, చంద్రారెడ్డి గవ్వా,పరశురామ్ పిన్నపురెడ్డి, భారతిపుల్లూరు, అనంత్రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, పైళ్ళమల్లారెడ్డి, ఎన్ ప్రేం రెడ్డి,జి.సుధాకర్రెడ్డి, సూర్యారెడ్డి,విజయ్పాల్రెడ్డి, శ్యాం ఎల్లంరాజు.












Click it and Unblock the Notifications