కాంగ్రెస్ శిబిరంలో నైరాశ్యం?

రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. మరో మూడున్నర రోజుల్లో ఫలితాలే వెలువడనున్నాయి. రాష్ట్రంలోనూ హంగ్ తరహా వాతావరణం కన్పిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్ధానాలు రావడం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆలస్యంగా గ్రహించారు. అటు మహాకూటమికి కూడా ఆ భయం పట్టుకుంది. సందట్లో సడేమియాలా దూరిన చిరంజీవి శిబిరంలో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ కొన్ని తప్పులు చేయకుండా ఉంటే అధికారం బంగారు పళ్ళెంలో పెట్టినట్టు అంది ఉండేదని చిరు శిబిరం మేధావులు అభిప్రాయం. ఇప్పటికీ రాష్ట్రంలో తమదే ప్రధాన పార్టీ అని వారు నమ్ముతున్నారు.
కడప జిల్లాలో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ నిన్న తన మిత్రులు, బంధువులతో రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. మెజారిటీకి కొద్దిగా తక్కువ సీట్లు వచ్చినా లెఫ్ట్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని వైఎస్ వారిని సముదాయించి పంపారట. వైఎస్ హయాంలో బాగు పడిన అందరికీ ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ఉండడం సహజమే. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఏమై పోతామోనన్న దిగులు కూడా వారిలో కనిపిస్తోంది. సాక్షి మీడియా గ్రూపు సిబ్బందిలోనూ ఆ భయం గోచరమవుతోంది. ముఖ్యమంత్రి కుమారుడిని మీద తప్పుడు కేసు పెట్టారంటూ సాక్షి పత్రికా సిబ్బంది ఎర్రటి ఎండలో డిజిపి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవన్నీ వేటికి సంకేతాలు? మూడున్నర రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications