హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి పార్టీలో లుకలుకలు!

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అన్నీ సజావుగా లేవన్న విషయం క్రమంగా స్పస్టమౌతోంది. గుంటూరు జిల్లానుంచి వచ్చిన ఒక ఎస్ సి అభ్య్యర్ధి నుంచి రెండు కోట్ల రూపాయలను ఆ ఆపార్టీ ముఖ్యులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవికి, ఎన్టీఆర్ కి ఎంత తేడా ఉందో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం తెలిసిందే.

కృష్ణా జిల్లా వరకు చిరంజీవి రాజకీయ వ్యూహాల బలహీనత బయట పడింది. విజయనిర్మలను కృష్ణా రూరల్ కన్వీనర్ గా నియమించడంతో మొదలైన గొడవ రాష్ట్రానికంతటికీ పాకింది. పెద్ద మనిషి అయిన కెపి రెడ్డయ్యను చిరంజీవి ఆశ్రయించి ఆ జిల్లా బాధ్యతలను అప్పగించాలని ఆలొచిస్తున్నట్టు తెలుస్తోంది.

సంస్ధాగత నిర్మాణంలో చిరంజీవి పార్టీ బాగా వెనుకబడి ఉంది. చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను చూడడానికి జనం వస్తున్నా వారు ఎన్టీఆర్ లాగా ఒక పవర్ ఫుల్ మెసేజ్ ని ఇవ్వలేకపోతున్నారు. తన పార్టీకి కాపు కులం ముద్ర పడకుండా చిరంజీవి ఎంత జాగ్రత్త పడినా కృష్ణా జిల్లా విషయంలో ఆయన డొల్లతనం బయట పడింది.

చిరంజీవి పార్టీకి ముప్పైకి మించి స్ధానాలు రావని ఇప్పటికిప్పుడు తాజా అంచనాల ప్రకారం తెలుస్తోంది. అయితే హంగ్ అసెంబ్లీ వస్తే కీలక పాత్ర వహించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X