జగన్ కు మరో చెక్!

ఆనాడు వైఎస్ ఉపయోగించిన టెక్నిక్ ను మరో రకంగా డిఎస్ జగన్ పై ప్రయోగించనున్నారు. రాజశేఖరరెడ్డి మరణంతో ఖాళీగా ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక త్వరలో జరుగనుంది. అక్కడి నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ అసెంబ్లీలో అడుగుపెడితే కాంగ్రెస్ పార్టీలో 90 శాతం ఆయన వైపే ఉంటుంది. అప్పుడు డిఎస్ కు ఏ మాత్రం విలువ ఉండదు. అందువల్ల జగన్ కు టికెట్ ఇస్తే వచ్చే నష్టాల గురించి డిఎస్ సోనియాగాంధీకి వివరించనున్నట్టు తెలిసింది. నేడు డిఎస్ ఢిల్ల్లీ వెళ్ళారు. నేడో రేపో ఆయన సోనియా గాంధీని కలిసి జగన్ కు పులివెందుల టికెట్ ఇవ్వవద్దని వేడుకోనున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత రోశయ్య తొలిసారిగా నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. పదవి ఇచ్చిన కిక్కుతో ఆయన అంత పెద్ద వయసులోనూ యువకుడిగా కన్పిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులను ఆయన సోనియాగాంధీకి వివరించనున్నారు. సిఎల్పీ, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఎలా నిర్వహించాలో సోనియా గాంధీ నుంచి సలహాలు పొందనున్నారు. రోశయ్య మంత్రివర్గాన్ని తనకు తగిన రీతిలో ఏర్పాటు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ పొందుతారన్న మాట వినిపిస్తున్నది. అయితే ఇప్పుడే తన స్వంత మంత్రివర్గ జాబితా తీసుకు వెళ్తారా లేదా అనేది తెలియ రాలేదు. అదే సమయంలో తన మంత్రివర్గంలో ఉంటూనే ధిక్కార వైఖరి ప్రదర్శిస్తున్న కొందరు మంత్రుల విషయంలో ఆయన తాడో పేడో తేల్చుకోనున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఈ కార్తీక సోమవారం జగన్ వర్గానికి మరో పెద్ద పరీక్షగా నిలువనుంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications