కాంగ్రెస్ కు అనుకూలంగా చిరు?

గౌడ్ వెళ్లిన తర్వాత జరిగిన భేటీలో సైతం 'గౌడ్ కాంగ్రెస్లోకి వెళ్లవచ్చుకదా" అని చిరు పార్టీ నేతలవద్ద వ్యాఖ్యానించారు. స్పీకర్ ఎన్నిక నుంచి సభలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి వైఖరిని తప్పుపట్టేవరకూ తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే తమ పార్టీ కాంగ్రెస్కు దగ్గరకావాలని నిర్ణయించు కున్నట్లు కనిపిస్తోందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యా నించారు. దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి వంటి అగ్రనేత లు కూడా ఈ విధానం నచ్చకనే బయటకు వెళుతు న్నప్పటికీ.. పార్టీ నాయకత్వం మాత్రం కాంగ్రెస్ను వ్యతిరేకించనంత వరకూ తమ పార్టీకి వచ్చిన ప్రమాదం ఏమీలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అసెంబ్లీలోని చిరంజీవి ఛాంబర్లో కూడా ఎక్కు వగా కాంగ్రెస్ వారే కనిపిస్తుండటం లాబీల్లో చర్చనీ యాంశంగా మారింది. చిరంజీవి సామాజికవర్గా నికి చెందిన మంత్రి వట్టి వసంత కుమార్ తరచూ చిరు ఛాంబర్కు రావడం, ఆయనతో పాటు..కాంగ్రెస్ ప్రచార ప్రతినిధులు వచ్చి చిరుతో మంత నాలు జరపటం ఈ అనుమానాలకు మరింత బల మిస్తోంది. పీఆర్పీని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి వసంతకుమార్ను పార్టీ నియమించిందన్న ప్రచా రం సాగుతోంది. గతంలో వట్టి నామినేషన్ కార్య కమానికి అల్లు అరవింద్ హాజరయ్యారు. 'మా వాళ్ల అయోమయాన్ని కాంగ్రెస్ బాగా వాడుకుంటోంది. తరచూ వాళ్లు మా బాస్ ఛాంబర్కు రావడం ద్వారా మా పార్టీ కాంగ్రెస్కు దగ్గరవుతోందన్న సంకేతా లను మీడియా ద్వారా పంపడమే కాంగ్రెస్ లక్ష్యం" అని ఓ ఎమ్మెల్యే వెల్లడించారు.












Click it and Unblock the Notifications