రాములమ్మ కోవర్టు?

మెదక్ సీటు కోసం పట్టుబట్టడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. తెరాసకు పెట్టని కోట అయిన మెదక్ లో తెరాసను దెబ్బ తీయడంలో భాగంగానే ఆమె ఆ సీటు కోసం పట్టుబడినట్లు చెబుతున్నారు. కెసిఆర్ తనకు ఆ సీటు ఇవ్వకపోతే ఎన్నికలకు ముందే పార్టీని చీల్చుకురావాలనేది ఆమె వ్యూహమట. అయితే కెసిఆర్ ఆ సీటును ఆమె కోసం త్యాగం చేశారు. పైగా హరీష్ రావు వెంట ఉండి ఆమెను గెలిపించారు.
శాసనసభ, లోకసభ స్థానాలకు పోటీ చేసి తెరాస ఉప ఎన్నికలను ఎదుర్కున్న సమయంలో విజయశాంతి పని కట్టుకుని వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి తెరాసకు వ్యతిరేకంగా పని చేశారు. కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. నిజానికి ఆ సమయంలోనే ఆమె కాంగ్రెసు నాయకులతో కుమ్మక్కయినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని కూడా చాలా మంది చెవులు కొరుక్కున్నారు.
తాజాగా విజయశాంతిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెనకేసుకొని రావడం, తెరాస నుంచి కాంగ్రెసులోకి వెళ్లిన నరేంద్ర, తూర్పు జయప్రకాష్ రెడ్డి వంటి నాయకులు విజయశాంతితో సమావేశాలు నిర్వహిస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ ప్రచారం వల్ల కెసిఆర్ కన్నా విజయశాంతికే ఎక్కువ నష్టం జరుగుతుందనేది వేరే విషయం.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications