సోనియా 'తెలంగానం'?

అనేక కుంభకోణాల్లో వైఎస్ చిక్కుకుని ఉన్నందువల్ల తెలంగాణ గురించి పట్టుబట్టడానికి ఇదే మంచి తరుణమని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు సోనియాగాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం గురించి ప్రకటన చేసి, టీఅర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం మహా కూటమి ప్రభావం తగ్గిపోతుందని అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే సోనియా గాంధీకి చెప్పారు.
ఆంధ్రప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పార్టీ శ్రేయస్సుకి మంచిదని చెప్పినట్టు తెలిసింది. నిన్న సోనియాగాంధీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీకి ఇదే విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో సోనియాగాంధీ అనుకూలంగా ఉన్నట్టు సాంబశివరావు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం విషయంలో వైఎస్ ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయనను నమ్ముకుని పూర్తి స్వేచ్చ ఇచ్చిన అధిష్టానవర్గం ఎన్నికల ముందు పునరాలోచనలో పడింది. వైఎస్ ఒంటెద్దు పోకడలు, ఆయన చుట్టూ కమ్ముకున్న కుంభకోణాల నీడలు హై కమాండ్ ను కలవరపరుస్తున్నాయి. ఒక్క వారం రోజుల్లో ఒక స్పష్టమైన రాజకీయ చిత్రం కన్పించే అవకాశాలున్నాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications