వీరప్ప మొయిలీపై వేలాడుతున్న కత్తులు

శ్రీకాకుళం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రులు గాని పాల్గొన లేదు. అయితే తూర్పులో మాత్రం ఎక్కువ మంది ఎమ్మె ల్యేలు ఓదార్పునకు సహకరిస్తారనే భావిస్తున్నారు. గత రెండు రోజులుగా పార్టీ అధిష్టానవర్గం ఓదా ర్పులో ఎమ్మెల్యేలు పాల్గొనకుండ కట్టడి చేసే ప్రయ త్నాలు ఫలించే అవకాశాలు లేవు. పాల్గొంటే అంతా పాల్గొందాం, లేకపోతే అంతా తప్పుకుందాం అనే దానిపై జరిగిన చర్చలు సైతం ఫలించలేదు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్లు యాత్ర ప్రారం భం నుండి ముగింపు రోజు వరకు జగన్ వెన్నంటే ఉంటా మని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలలో ఐకమత్యమనేది లోపించింది. అసలు జిల్లాలో ప్రజాప్రతినిధులంతా స్వర్గీ య వైయస్ గూటిలో పక్షులే. జగన్ ఓదార్పు యాత్రలో తాము పాల్గొంటామని, అది తమ బాధ్యతని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు పూర్తి కాగానే యాత్రలో పాల్గొంటానని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సుస్పష్టం చేశారు. అన్నమాట మీద ఆయన కట్టుబడి 17న ఓదార్పులో పాల్గొంటానంటున్నారు.












Click it and Unblock the Notifications