విభజన వల్ల జగన్ కు మేలు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రతిష్ట పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పోట్టి శ్రీరాములు తరహాలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. తెలంగాణ ఏర్పడితే కాంగ్రెసు ఈ ప్రాంతంలో తిరుగులేని బలాన్ని సంపాదించుకుంటుందని, సీమాంధ్రలో, హైదరాబాదులో మాత్రం నష్టపోతుందని అంటున్నారు. అందుకే తెంలగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జాప్యం చేస్తున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెసుకు జరిగే నష్టం మేరకు లాభపడుతుందని అంచనాలు వేస్తున్నారు. సీమాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి విశేష ప్రజాదరణ లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. కాపుల జనాభా కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో చిరంజీవికి జనాదరణ పెరుగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications