దానికి పవన్ కళ్యాణే కారణమా?

చిరంజీవి పార్టీ పెట్టే సమయంలో తొలుత రాధా పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకే ఆయన పార్టీలోకి వచ్చినట్లు చెబుతారు. ఈ స్థితిలో రాధా ప్రాబల్యం పార్టీలో తగ్గడమే కాకుండా తాను మద్దతిచ్చిన శాసనసభ్యుడు శ్రీనివాస రావు ఆయకు దూరమయ్యారు. విజయవాడ పార్టీలో తనను కాదని శ్రీనివాస రావును చిరంజీవి ప్రోత్సహించడాన్ని రాధా జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రభల కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు కావడం వెనక కారణం అదేనని అంటున్నారు.
అదే సమయంలో చిరంజీవి తన కూలాన్ని పూర్తిగా సొంతం చేసుకునే స్థితిలో లేరు. కాపు కులానికి మాత్రమే తాను ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తే పార్టీపై ఆ ముద్ర పడుతుందని, అది నష్టం చేస్తుందని చిరంజవి భావిస్తున్నట్లు సమాచారం. రాధ తండ్రి వంగవీటి రంగాపై నిర్మించ తలపెట్టిన సినిమాల్లో నటించడానికి చిరంజీవి నిరాకరించడం వెనక కూడా అదే కారణం ఉందని అంటారు. తాను ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపించకూడదని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. దీంతో కాపు కులానికి చెందిన నాయకులు పలువురు చిరంజీవికి దూరమవుతున్నారు.












Click it and Unblock the Notifications