తెలంగాణకు అనుకూలమా?

తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దాన్ని బట్టి తెలంగాణ విషయంలో ఆయన వివాదాల్లోకి వెళ్లదలుచుకోలేదని తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రకు చెందినవాడిగా ఆ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగితే కట్టడి చేయగల సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఎస్సై రాత పరీక్షల వాయిదా ద్వారా అధిష్టానం రోశయ్య సత్తాను ప్రయోగానికి పెట్టినట్లు సమాచారం. పరీక్షలు వాయిదా వేయాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. వాయిదాలో రోశయ్య ప్రమేయం లేదు. పరీక్షలను వాయిదా వేసిన వెంటనే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగాయి. ఆ ఆందోళనలను అదుపు చేయడంలో రోశయ్య విఫలమయ్యారు. దాంతో ముఖ్యమంత్రిని మార్చాలనే గట్టి నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ముఖ్యమంత్రిని ఖరారు చేసినట్లవుతుందని చెబుతున్నారు. అయితే, బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే మాత్రం అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా పావులు కదుపుతుందని గట్టిగా నమ్మవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బొత్స సత్యనారాయణ అనుకూలంగా ఉన్నారు. దానివల్ల ఆ అభిప్రాయానికి బలం చేకూరుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కాంగ్రెసుకు లభిస్తుంది. సీమాంధ్రలో కూడా కాంగ్రెసుకే మెజారిటీ ఉంటుంది. సీమాంధ్రలో చిరంజీవి మద్దతు తీసుకోవడానికి కూడా వీలవుతుంది. గీతారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తే ఆమెను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కోరిక కూడా నెరవేర్చినట్లవుతుంది.












Click it and Unblock the Notifications