జగన్ కు మొయిలీ ఊడిగం?

మొయిలీని తొలగిస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, మొయిలీ వైయస్ జగన్ కు అండగా నిలబడుతున్నారనే విషయం పార్టీ అధ్యక్షురాలు సోనియాకు కూడా తెలుసునని, కానీ వెంటనే తొలగించడం వల్ల అనవసరమైన ప్రాధాన్యం కల్పించినట్లవుతుందని భావించి కొనసాగిస్తున్నారని అంటున్నారు. మొయిలీ మార్పు కూడా మామూలు వ్యవహారంలాగా జరిగిపోయే సమయం కోసం ఆమె చూస్తున్నారని అంటున్నారు.
కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా కెవిపి రామచందర్ రావుకు, మొయిలీకి సహకరిస్తున్నట్లు కాంగ్రెసు సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన డిఎస్ ముఖ్యమంత్రి రోశయ్యకు పూర్తిగా సహకరించడం లేదని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జాప్యం కావడానికి కూడా మొయిలీయే కారణమని చెబుతున్నారు. మొయిలీకి చెప్పి మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాల్సిన పరిస్థితి ఉండడం వల్ల వైయస్ జగన్ వర్గానికి ప్రాధాన్యాన్ని తగ్గించడానికి వీలు కాదనే ఉద్దేశంతో ఉండి రోశయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించడం లేదని అంటున్నారు. మొత్తం మీద, మొయిలీ మొదటి నుంచీ వైయస్ జగన్ కు అనుకూలంగానే ఉంటూ వస్తున్నారనేది కాదనలేని నిజం.












Click it and Unblock the Notifications