సచిన్ తో సైనా పోటీ
సైనా వ్యాపార ప్రకటనలు, వ్యాపార విషయాలను చూస్తున్న దక్కన చార్జర్స్ స్పోర్టింగ్ వెంచర్స్ మీడియా సైనా బ్రాండ్ విలువ పెరిగిందని చెప్పారు. తాజాగా ఎయిర్ టెల్ సైనాతో కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుందని, మరో నాలుగు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే సైనా అదానీ విల్మర్ కు చెందిన వంటనూనెలను, దక్కవ చార్జర్స్ వార్తా పత్రికకు, హెర్బల్ లైఫ్ కు ప్రచారం చేస్తోంది.
ప్రచార సాధకులుగా ఇప్పటి వరకు క్రికెటర్లు మాత్రమే ముందంజలో ఉన్నారు. అయితే మొదటిసారి క్రికటేతర క్రీడాకారిణి సైనా నెమ్మదిగా సచిన్, ధోనీలను చేరుకుంటుంది. సచిన్, ధోనీలు మూడు కోట్ల రూపాయల బ్రాండ్ తో ముందున్నారు. సెహ్వాగ్ కోటి రూపాయల బ్రాండ్ తో రెండవ స్థానంలో ఉన్నారు. సెహ్వాగ్ తో ఇప్పటికే సమానంగా ఉన్న సైనా ముందుముందు సచిన్, దోనీలతో సమానంగా ఉండవచ్చని వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. ఇంతకుముందు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రికటేతర క్రీడలలో ఎక్కువ పారితోషికం తీసుకున్న తారగా ఉండేది. అయితే ఆమె బ్రాండ్ విలువ సానియాలో నాలుగో వంతుకే పరిమితమయింది. 25 లక్షల రూపాయలతోనే అమె కేరీర్ వెనక్కి మళ్లింది. అదే సైనా మాత్రం ఒక్కసారిగా కాకుండా దిన దిన ప్రవర్థమానం దూసుకెళుతుంది.