వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ క్లియర్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు చాలా స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఆయన అనుచరుడు, కాంగ్రెసు బహిష్కృత నేత అంబటి రాంబాబు గురువారం చేసిన ప్రకటన ఆ విషయాన్ని స్ఫష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను పార్టీ అధిష్టానం తప్పిస్తుందనే మాటను ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే వార్తలను ఆయన ఖండించారు. డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే ఏమైనా మార్పులుంటాయని ఆయన అన్నారు. దీన్ని బట్టి వైయస్ జగన్ వర్గం ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతోంది. అంతే స్పష్టంగా తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదని వైయస్ జగన్ కు తెలిసే ఉంటుంది. అందుకే ఆయన తన బలగాన్ని, బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెసు పార్టీలోకి రాలేనివారిని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన చేరదీస్తున్నారు.

వైయస్ జగన్ పై కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ అంశం తేలేవరకు వైయస్ జగన్ కూడా అంత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఈలోగా ఆయన కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర ఖరారయ్యే అవకాశం ఉంది. అది కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే ఉంటుందని అంటున్నారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ఏ విధంగా వ్యవహరించబోతుందనేదానిపై కూడా జగన్ కు స్పష్టత ఉండి ఉంటుంది. తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా ఉండడం వల్లనే సీమాంధ్రలో తన బలాన్ని పెంచుకోవడానికి ఓదార్పు యాత్రల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. వ్యూహాత్మకంగా మాత్రం తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదని ఆయన ప్రస్తుతానికి అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X