తమిళనాడు దిశగా ఆంధ్రప్రదేశ్
రెండు రోజుల పాటు హైదరాబాదులో ఉన్న ఆయన పార్టీ తీరు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తమ పార్టీకి వైయస్ జగన్ను సమస్యగా భావించారు. కానీ సమస్య జగన్ కాదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే అసలు సమస్య అని ఆయన ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మీద వెల్లువెత్తిన అసంతృప్తి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మీద కూడా రాలేదని అంటున్నారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెసు పార్టీకి మేజర్ సర్జరీ అవసరమని ఆయన పార్టీ అధిష్టానవర్గం పెద్దలకు చెప్పారని అంటున్నారు.
వివిధ నాయకులు అందిస్తున్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటూ వస్తున్న పార్టీ అధిష్టానం గులాం నబీ ఆజాద్ ప్రత్యక్షంగా చూసి విషయాలు చెప్పడంతో కంగు తిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం కావడం మామూలేనని, అయితే ఇంతగా ఎప్పుడూ లేదని, మేజర్ సర్జరీ చేస్తే తప్ప పరిస్థితి చక్కబడదని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీరు పట్ల కూడా ఆజాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. డిఎస్ ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వచ్చే ఒకటి రెండు నెలల్లో ఆజాద్ సూచన మేరకు మేజర్ సర్జరీకి శ్రీకారం చుట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.