మారిన చిరంజీవి స్టయిల్
అయితే పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెసు పార్టీ నాయకుడిగా మారిన తర్వాత పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. చిరుకు మొహమాటు కూడా ఎక్కువే. అయితే కాంగ్రెసులో 2014 ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అంటూ అభిమానులకు, ప్రజలకు పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాదు తన మాటల్లో కూడా దూకుడు పెంచారు. మాజీ పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నా అన్ని సీట్లు, ఓట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. కొత్తగా వచ్చిన పార్టీ 18 శాతం ఓట్లు, 18 సీట్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదని, అన్ని సీట్లు, ఓట్లు గెలుచుకోవాలని జగన్కు సవాల్ విసిరారు. కాంగ్రెసులో చేరి దివంగత సిఎం వైయస్పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపైనా ఘాటైన వ్యాఖ్యలే చేస్తున్నారు.
పీఆర్పీ అధినేతగా చిరంజీవి ఎప్పుడూ మనం అంటూ, ప్రజారాజ్యం అంటూ మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం పూర్తి విరుద్దంగా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ఇప్పుడు నేను అంటూ మాట్లాడుతున్నారు. మీడియాపైన విసుర్లు వేస్తున్నారు. మొత్తానికి పీఆర్పీ అధినేతగా సున్నిత మనస్కుడైన చిరంజీవి ఇప్పుడు సౌండ్ పెంచడం ద్వారా తనకూ కాంగ్రెసు సంస్కృతి అబ్బిందని నిరూపించినట్టుగానే కనిపిస్తోంది. తాను పరుషంగా మాట్లాడితే జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెసు కాపాడుతుందో లేక పార్టీకి ఇప్పుడు తాను తప్ప ఎవరూ లేరనే విశ్వాసమో చిరులో ఉన్నట్టు ఉంది. ఆయితే ఆయనను కాంగ్రెసు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటికే చిరు వ్యాఖ్యలపై కొందరు విభేదిస్తున్నారు.