తెలంగాణపై మారని చిరంజీవి

తాను సమైక్య నినాదం ఇవ్వడమే కాకుండా పనిలో పనిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు ఆయన ఉచిత సలహా కూడా పారేశారు. సమైక్యవాదాన్ని బలపరిచేందుకు ముందుకు రావాలని ఆయన నారాయణకు సలహా ఇచ్చారు. విశాలాంధ్ర చిరకాలం ఉండే దిశగా నారాయణ ఆలోచన చేయాలని ఆయన సూచించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరుస్తున్న విషంయం తెలిసిందే. అందుకే చిరంజీవి నారాయణకు ఆ ఉచిత సలహా ఇచ్చారు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత తాము సామాజిక తెలంగాణకు కట్టుబడుతామని చిరంజీవి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన వెంటనే మాట మార్చి సమైక్యవాద తీర్థం పుచ్చుకున్నారు. సమైక్యవాదంతో సీమాంధ్రలో పర్యటనలు కూడా చేశారు. కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత ఆ వివాదంలోకి ఆయన వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన గొంతు విప్పారు.












Click it and Unblock the Notifications