చిరు ఎంట్రీతో మారిన కాంగ్రెసు సమీకరణాలు

శివశంకర్ వంటి నేతకు దివంగత ఇందిరాగాంధీ తోనే సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదని, వి.హన్మంతరావుకూ రాజీవ్, సోనియాల వద్ద పలుకుబడి ఉన్నప్పటికీ ఆయనదీ అదే పరిస్థితి అని, డి.శ్రీనివాస్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, ఆ సమయంలో ఆయన చట్టసభల్లో సభ్యుడు కాకపోవడం, 2004లో గెలిచినప్పటికీ ఆయన అవకాశాన్ని వైఎస్ ఎగరేసుకుపోవడంతో కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయిందని ఆ పత్రిక రాసింది.
ఆ పత్రిక కథనం ప్రకారం - 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కొత్త పార్టీ స్థాపించిన తర్వాత కాపు-బలిజ వర్గాల ఆలోచనా ధోరణిలో అనూహ్య మార్పు వచ్చింది. ఇంతవరకూ కాపుల నుంచి ఎవరూ సీఎం కాకపోవడం, చిరంజీవికి సినీగ్లామర్ ఉన్నందున ఆయన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున, చిరు ప్రజారాజ్యం పార్టీకి పట్టం కట్టాలని ఆ రెండు సామాజికవర్గాలు భావించాయి. అదేవిధంగా, తెలంగాణలో మున్నూరు కాపులు కూడా పీఆర్పీకి అనుకూలంగా మొగ్గు చూపారు. ఫలితంగా, అంతకుముందు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించిన ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ వంటి జిల్లాల్లో ఓట్ల శాతం దెబ్బతిని, ఆ ఓట్లు పీఆర్పీకి పోలవడంతో కాంగ్రెస్కు సీట్లు-ఓట్లు దెబ్బతిన్నాయి. దీంతో కాపులను చేరదీసేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయించే బాధ్యతను అప్పట్లో బొత్స సత్యనారాయణకు అప్పగించారు. అదే ఫార్ములా ఇప్పుడు అమలవుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఒక్కటిగా నడుస్తూనే బొత్స సత్యనారాయణ, చిరంజీవి పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications