బాబుపై విచారణ ఎందుకిలా?

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) తదితరులతో విచారణ జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. రాజకీయ నాయకులపై సిబిఐ దర్యాఫ్తు సహజమే! ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలపై సిబిఐ దర్యాఫ్తు జరుగుతోంది. జగన్‌కు ఈడి నోటీసులు జారీ చేసినప్పటికీ అది కొంతకాలం తర్వాతే. కానీ రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు పాలించిన చంద్రబాబు పైన హైకోర్టు ఏకంగా సిబిఐ, ఈడి, హోం సెక్రటరీ, డిజిపిల విచారణకు ఆదేశించింది.

దీంతో బాబు ఆస్తుల కేసు విచారణ అందరిలోనూ ఉత్కంఠను రేకిస్తోంది. జగన్ కాంగ్రెసు పార్టీని వీడిన తర్వాతే కక్ష సాధింపు చర్యగా ఆయనపై దర్యాఫ్తు ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ బాబు అధికారానికి దూరమై ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత అదీ దివంగత ముఖ్యమంత్రితో సహా పలువురు ఆయనపై 26 వరకు కేసులు వేసి ఏమీ నిరూపించలేక పోయారనే వాదన టిడిపి నుండి వినిపిస్తున్నప్పటికీ ఇన్ని విచారణలు వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. బాబు కేసులో అందరూ బిగ్ షాట్సే.

బాబు ఆస్తులపై వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అంత తీవ్రంగా పరిగణించింది కాబట్టే ఇంతటి స్థాయి విచారణకు ఆదేశించారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అక్రమాలు బయటపెట్టేందుకు సిబిఐ విచారణ జరుగుతుంది. అంతర్జాతీయ అక్రమాలు బయటపెట్టడానికి ఈడి రంగంలోకి దిగుతుంది. సిబిఐ, ఈడి, డిజిపి, హోం సెక్రటరీ ఇలా అందరి నివేదికలను కోర్టు పరిశీలించి పూర్తి దర్యాఫ్తుకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. అంతేకాకుండా సిబిఐకి ఇప్పటికే జగన్, గాలి కేసులు ఉన్నందున వారిపై భారం తగ్గించేందుకు కూడా మిగతా విచారణ సంస్థలను కోర్టు ఆదేశించినట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+