జగన్ గెలిచాడా? ఓడిపోయాడా?

అవిశ్వాస తీర్మానం సమయం వరకు జగన్ ఎమ్మెల్యేల్లో కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు ఇటీవల మాట్లాడిన తీరు చూసినా కొందరిలో అవిశ్వాసానికి మద్దతిచ్చే అంశంపై అనుమానాలు కలిగాయి. కానీ చివరకు తనతో రెండు రోజులుగా భేటీ అవుతున్న ఎమ్మెల్యేలచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించడం ద్వారా జగన్ విజయం సాధించారు. తద్వారా ఇన్నాళ్లూ తాను చెప్పిన నైతికతను ఆయన నిరూపించుకున్నారని ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు. జయసుధ, కుంజా సత్యవతి తదితర ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెసులో ఉంటామని ప్రకటించారు. దీంతో వారిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
అవిశ్వాసం ద్వారా జగన్, కాంగ్రెసు ఒక్కటే అని నిరూపించాలనుకున్న టిడిపి ఇందులో విఫలమైందనే చెప్పవచ్చు. అవిశ్వాసం ద్వారా వస్తుందనుకున్న క్రెడిబిలిటీ టిడిపికి రాలేదు. కేవలం ప్రజా సమస్యలు, తెలంగాణ అంశాలు ప్రాస్తావించడంలో మాత్రమే విజయం సాధించారు. కాని జగన్ విషయంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే అసెంబ్లీలో జగన్ బలమెంతో ఓ అవగాహన రావడానికి మాత్రం టిడిపి, ప్రభుత్వానికి ఈ వేదిక ఉపయోగపడిందనే చెప్పవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ బలాన్ని తేల్చడానికే ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చిందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications