తెలంగాణపై జెపి దిగొచ్చారా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్తగా ఓ రాజధాని వస్తుందని, దానివల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ప్రజల సమస్యలు తీరవని ఆయన ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా ఆయన అన్నారు. చాలా కాలంగా క్రమం తప్పకుండా ముందుకు తెస్తున్న ఈ వాదనను ఆయన కాస్తా పక్కన పెట్టారు. దాన్ని పక్కన పెట్టి సమస్యను పరిష్కరించాల్సిన అంశంపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఓ రకంగా ఇది జెపిలో వచ్చిన మార్పు. మిగతా సమైక్యాంధ్ర వాదుల మాదిరిగా కాకుండా కాస్తా సానుకూలంగా ఆయన మాట్లాడడం కొత్త పరిణామం.
సమస్యను దాని మానానికి దాన్ని వదిలేసి వ్యవహరించడం సరి కాదనేది ఆయన అభిప్రాయం. ఆ మాత్రం చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకుండా పోయిందనేది వాస్తవం. సమైక్యవాదాన్ని పుచ్చుకున్న మిగతా సీమాంధ్ర నాయకులు కూడా ఈ దిశగా ఆలోచిస్తే తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఈ రీత్యా జెపి సీమాంధ్రకు, తెలంగాణకు మధ్య ఓ మధ్యవర్తి పాత్రను పోషిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications