వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో పోటీకి జగన్ పార్టీ దూరం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఊరట కలిగించే విషయం. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉప ఎన్నికలపై జగన్ శని, ఆదివారాల్లో పార్టీ తెలంగాణ నాయకులతో చర్చించారు. పోటీ చేయకపోవడం వల్ల చేకూరే లాభనష్టాలపై బేరీజు వేసినట్లు తెలుస్తోంది. పోటీ చేయడం కన్నా పోటీ చేయకపోవడం వల్లనే తెలంగాణ ప్రజల మనసు దోచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన తెలంగాణ నాయకులతో చెప్పినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసినవారిని బలపరచడం ద్వారా తెలంగాణ ప్రజలు భవిష్య్తత్తులో తమ వైపు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారని తెలిసింది.

తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న ప్రస్తుత సమయంలో పోటీ చేసి ఓడిపోవడం కన్నా పోటీ చేయకుండా ఉండడం వల్లనే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు అంటున్నారు. అయితే, ఉప ఎన్నికలను పార్టీ సిద్ధాంతాలను, కార్యాచరణను ప్రచారం చేసుకోవడానికి వేదికగా వాడుకోవడానికి వీలవుతుందని, దాన్ని ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం పోటీకి దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ రాజీనామా చేసిన వారికి మద్దతిస్తే తెలంగాణ ప్రజల్లో పార్టీ గౌరవం పెరుగుతుందని, ఈ అవకాశాన్ని వాడుకుందామని ఆయన చెప్పినట్లు సమాచారం.

పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ వై. కిష్టా రెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కెకె మహేందర్ రెడ్డి వైయస్ జగన్‌ను విడివిడిగా కలిశారు. పోటీకి దూరంగా ఉండడం వల్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఎండగట్టడానికి వీలవుతుందని జగన్ వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అకస్మికంగా మృతి చెందిన రాజేశ్వర రెడ్డి భార్యను మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీకి దించాలనే ప్రతిపాదనను జగన్ ముందుకు తెస్తున్నారు. ఇందుకు కెసిఆర్ కూడా అంగీకరించే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో ఖాళీ అయిన ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

English summary
In a move meant to placate pro-Telangana forces and outwit both the Congress and TDP in the region, YSR Congress president Y S Jaganmohan Reddy in all likelihood is going to keep his party out of the ensuing bypolls for the six T seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X