కిరణ్కు వ్యతిరేకంగా బొత్స సైలెంట్ వర్క్?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. రాజీనామా చేయకుండా రవీంద్రా రెడ్డిని బుజ్జగించే పనిని ఆయన పెట్టుకున్నారు. రవీంద్రా రెడ్డి బొత్స సత్యనారాయణతో సమావేశమై తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తన బాధ్యతను నిర్వహించారని బయటకు చెప్పే మాట. అయితే, దాని వెనక కిరణ్ కుమార్ రెడ్డిని బలహీనపరిచే వ్యూహం ఇమిడి ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై బొత్స సత్యనారాయణ కన్ను వేశారనేది కొత్త విషయమేమీ కాదు.
బొత్స సత్యనారాయణ తనపై విమర్శలు చేస్తున్నవారిని దగ్గరకు తీసుకుంటున్న క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవికి దగ్గరవుతున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. చిరంజీవిని తనతో కలుపుకుని వెళ్లడం ద్వారా బొత్స సత్యనారాయణ వ్యూహాన్ని దెబ్బ తీయాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెసులో రెండు పవర్ సెంటర్లు ఉండడం కొత్తేమీ కాదు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పిసిసి అధ్యక్ష పదవి మొక్కుబడిగా మారింది. మిగతా అన్ని కాలాల్లోనూ పిసిసి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి పడకపోవడం కాంగ్రెసు రాజకీయాల్లో మామూలు వ్యవహారమే.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications