బొత్సకు చేయి: చిరంజీవితో కిరణ్ రెడ్డి దోస్తీ

ఈ పరిస్థితిలో పార్టీ వ్యవహారాలను కూడా చిరంజీవితో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన చేతుల్లోకి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. బొత్సను అప్రధానం చేసి, చిరంజీవిని ప్రధానంగా ముందుకు తేవాలనేది ఆయన ఉద్దేశమని అంటున్నారు. ఇటీవల చిరంజీవి సోనియా గాంధీని కలిశారు. ఈ భేటీలో కూడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, ముఖ్యమంత్రితో కలిసి పని చేయాలని, ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని ఆమె చిరంజీవికి చెప్పినట్లు సమాచారం. అందుకే చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తగిన ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో పార్టీ వ్యవహారాలే ప్రధానంగా ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. చిరంజీవికి పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో చిరంజీవి పాత్ర మరింత పెరిగేలా తగిన వ్యూహాన్ని ముఖ్యమంత్రి రూపొందించినట్లు, దాన్నే ముఖ్యమంత్రి చిరంజీవికి వివరించినట్లు తెలుస్తోంది. ఏమైనా, బొత్సను పోటీ నుంచి తప్పించి ముందుకు రావడానికి చిరంజీవికి ఈ పరిణామం ఉపయోగపడుతుందని అంటున్నారు. కలిసి పనిచేయాలని కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications