అజరుద్దీన్కు ఎన్నికల కమిషనర్ నోటీసు

శంషాబాద్లో ఆనయ ఈ నెల 11వ తేదీన శాలువాలు పంపిణీ చేశారు. ఎన్నికల కమిషనర్ అయిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మహేంద్ర కుమార్ మిశ్రా అజరుద్దీన్కు నోటీసు జారీ చేశారు. లోకసభ సాధారణ ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన మొహ్మద్ అజరుద్దీన్ మొరదాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతను మీదేసుకోవాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో అజర్ క్షణం తీరిక లేకుండా పోరాడుతూ వస్తున్నారు. క్రికెట్లో డకౌట్ కావడాన్ని తాను అవమానకరంగా భావించేవాడినని, ఎన్నికల్లో కాంగ్రెసు డకౌట్ కావడం కూడా తనకు అంతే అవమానకరంగా భావిస్తానని ఆయన ఇటీవల అంటూ కాంగ్రెసును గెలిపించాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications