దాసరి స్థానంలో చిరు, పది రోజుల్లో కేబినెట్లోకి!

ఈ నెలాఖరున ప్రధాని మన్మోహన్ కేబినెట్లోకి నలుగురు కొత్తవాళ్లు చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారం, పది రోజుల్లోనే చిరు బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా సామాజిక వర్గాల పరంగా చూస్తే కొత్తగా అవకాశమిచ్చిన వారిలో కాపు, కమ్మ, రెడ్డి, బిసిలకు సీట్లు దక్కాయి. కాపు వర్గానికి చెందిన దాసరి నారాయణ స్థానంలో అదే వర్గానికి చెందిన చిరంజీవి, సంజీవ రెడ్డి స్థానంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, బిసి వర్గానికి చెందిన కేశవ రావు స్థానంలో రాపోలు ఆనంద భాస్కర్కు అవకాశం ఇచ్చారు. ఇక కాంగ్రెసులో కాపులకు ప్రధాన్యం పెరుగుతుందన్న విమర్శల నేపథ్యంలో రషీద్ అల్వీ స్థానంలో రేణుకా చౌదరికి చోటు కల్పించారు. కొత్తగా ఎంపికైన నలుగురిలో చిరంజీవి తప్ప మిగిలిన ముగ్గురూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే.












Click it and Unblock the Notifications