హోళీ సంబరాలకు శ్రీలక్ష్మి దూరం, బ్యారెక్లోనే

ఓ టెలివిజన్ చానెల్ మహిళా ఖైదీలో కోసం ఓ షోను ఏర్పాటు చేసింది. అయితే, కెమెరా కంటికి చిక్కకుండా శ్రీలక్ష్మి దూరంగా ఉండిపోయారు. జైలులో జరిగే ఉత్సవాల్లో ఖైదీలందరూ పాల్గొనడం తప్పని సరి కాదని, శ్రీలక్ష్మి మాత్రమే కాకుండా చాలా మంది దూరంగా ఉండిపోయారని జైలు అధికారులు అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించారు. వ్యాస రచన పోటీల్లో కూడా వారు పాల్గొన్నారు.
మహిళా ఖైదీల పిల్లలకు పరుగు పందేలు పెట్టగా, మహిళా ఖైదీలకు వాకింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు కూడా ప్రదానం చేశారు. మహిళా ఖైదీలు హోళీ సందర్భంగా ఆడారు, పాడారు. వాటన్నింటికీ శ్రీలక్ష్మి దూరంగానే ఉండిపోయారు.












Click it and Unblock the Notifications