జగన్పై కిరణ్ గేమ్: అసద్పై పోటీకి అజహర్ రెడీ

ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఇటీవల మజ్లిస్ పార్టీ కాంగ్రెసు పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి నచ్చలేదని చెబుతూ మజ్లిస్ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో 2014లో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీంతో ముస్లింలు జగన్ వైపుకు మళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అజహరుద్దీన్ను రంగంలోకి దింపినట్లుగా కనిపిస్తోంది.
అందులో భాగంగానే అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీకి సై అన్నారని అంటున్నారు. అజహరుద్దీన్ శనివారం ఎపి భవనంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, అధిష్టానం ఆదేశిస్తే హైదారాబాదు నుండి పోటీ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులను అజహరుద్దీన్ పొగిడారు. మజ్లిస్ దూరమై జగన్ వైపుకు వెళ్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అజహర్తో భేటీ అయ్యేందుకు ఆసక్తి కనబర్చారట.
ఆయనతో మాట్లాడి హైదరాబాదు నుండి పోటీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పారని అంటున్నారు. చరిష్మా ఉన్న అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేస్తే మజ్లిస్ పార్టీకి ఎదురు దెబ్బ పడుతుందని కాంగ్రెసు పార్టీ భావిస్తోంది.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications