రేవంత్పై సండ్ర అసంతృప్తి: బాస్, సార్ ఎవరో తెలిసింది
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో సూత్రధారికి సంబంధించిన కీలకమైన ఆధారాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) రాబట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విచారణలో ఆ విషయం బయటపడినట్లు చెబుతున్నారు. నోటుకు ఓటు వ్యవహారాన్ని నడిపినవారు బాస్, సార్ అంటూ పదే పదే ప్రస్తావించిన విషయం తెలిసిందే.
వారి సంభాషణల్లో ప్రస్తావించిన బాస్, సార్ ఎవరనేది ఎసిబి అధికారులు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వారి లక్ష్యం ఏమిటనేది కూడా వారు కనిపెట్టినట్లు చెబుతున్నారు. నోటుకు ఓటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ను శుక్రవారంనాడు తమ కార్యాలయానికి రప్పించి ఎసిబి అధికారులు సండ్రకు ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు సమాచారం.
కేసులో మిస్సింగ్ లింకులను ఎసిబి అధికారులు ఈ విచారణలో కనిపెట్టినట్లు సమాచారం. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సండ్ర తర్ఫీదు పొందినట్లు భావిస్తున్నారు. దీంతో ఆయన ఎసిబి అధికారుల ప్రశ్నలకు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తపడ్డారని అనుకుంటున్నారు. ఈ స్థితిలో సెబాస్టియన్తో ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం వల్ల కొన్ని విషయాలు బయటకు వచ్చినట్లు చెబుతున్ారు
సండ్ర గన్మన్ లచ్చు ఇంతకు ముందు వాంగ్మూలం ఇచ్చాడు. అతని వాంగ్మూలం ఆధారంగా తొలుత సండ్రను ఎసిబి అధికారులు ప్రశ్నించారు. మే 29వ తేదీన మహానాడు ముగిసిన తర్వాత 30వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు అక్కడి నుంచి లేక్వ్యూ అతిథిగృహానికి వెళ్లారు. ఈ విషయాలను లచ్చు తన వాంగ్మూలంలో చెప్పాడు.

అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఎసిబి అధికారులు ప్రశ్నించారని, దానికి పార్టీ వ్యవహారాలు, ఇతర వ్యవహారాలు అంటూ సండ్ర అస్పష్టమైన సమాధానాలు ఇచ్చారని అటున్నారు. మే 31వ తేదీన రేవంత్ రెడ్డి నేరుగా రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్సన్ నివాసానికి వెళ్లడం పట్ల సండ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎసిబి వద్ద సమాచారం ఉందని అంటున్నారు.
జనార్దన్ వ్యవహారంపై కూడా ఎసిబి అధికారులు ప్రశ్నించారని అంటున్నారు. మే 30వ తేదీ ఉదయం చంద్రబాబు నివాసం నుంచి నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు సండ్ర వెళ్లడం జనార్దన్ను కలవడానికేనా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జనార్దన్ నేతృత్వంలోనే జరిగిందా అంటూ ఎసిబి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
జిమ్మీ గురించి కూడా ఎసిబి అధికారులు సండ్రను ప్రశ్నించారు. జిమ్మీ ఎలా తెలుసునని అడిగితే, ఆయనతో పెద్దగా పరిచయం లేదని, పార్టీ వ్యవహారాల్లో అప్పుడప్పుడు మాట్లాడేవాడినని సండ్ర చెప్పినట్లు తెలుస్తోంది. తాను కూడా పార్టీలో క్రైస్తవ వ్యవహారాలను చూస్తుంటానని, దానిలో భాగంగానే సెబాస్టియన్తో మాట్లాడి ఉంటానని ఆయన చెప్పారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన విషయంపై కూడా ఎసిబి అధికారులు ఆరా తీశారు. ఒకే జిల్లాకు చెందినవాళ్లం కాబట్టి వారితో మామూలుగా మాట్లాడి ఉంటానని, ఏం మాట్లాడానో గుర్తు లేదని సండ్ర వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications