మన్మోహన్ అప్సెట్: రోడ్డెక్కిన సోనియా, యాత్ర (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గురువారం నాడు ఉదయం రోడ్డెక్కారు! బొగ్గు కుంభకోణం కేసులో కోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోనియా, పార్టీ సీనియర్లు ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ తదితరులు ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ ఇంటి వరకు పాదయాత్రగా చేరుకున్నారు.
మన్మోహన్కు మద్దతుగా పాదయాత్ర చేశారు. అనంతరం సోనియా మాట్లాడారు. మన్మోహన్ సింగ్కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె చెప్పారు. తాము అందరం మన్మోహన్కు అండగా ఉంటామన్నారు.
కాగా, బొగ్గు కుంభకోణం కేసులో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీని పైన విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. మరోవైపు, దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు గడప తొక్కే అవకాశముంది.
తనకు నోటీసులు ఇవ్వడంపై మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. ఇది బాధాకరమైన విషయమన్నారు. ఇది తనను అప్సెట్కు గురి చేసిందన్నారు. అయితే, ఇది జీవితంలో ఓ భాగమని, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని చెప్పారు.

సోనియా గాంధీ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గురువారం నాడు ఉదయం రోడ్డెక్కారు! బొగ్గు కుంభకోణం కేసులో కోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సమన్లు జారీ చేసింది.

సోనియా గాంధీ
మన్మోహన్కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం పాదయాత్ర చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ ఇంటి వరకు పాదయాత్ర చేశారు.

సోనియా గాంధీ
బొగ్గు కుంభకోణం కేసులో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీని పైన విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

సోనియా గాంధీ
సోనియా మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసునని చెప్పారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications