వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలీనం-పొత్తు: కాంగ్రెస్ పెద్దలకి కెసిఆర్ సీట్ల లెక్కలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ విలీనంపై తీవ్ర తర్జన భర్జన పడుతున్నారట. విలీనం మంచిదా, పొత్తు ఉత్తమమా అని బేరీజు వేసుకుంటున్నారు. విలీనం ద్వారా రెండు పార్టీలకు లాభం ఉండదని కెసిఆర్ కాంగ్రెసు పార్టీ పెద్దలకు చెబుతున్నారట. దీంతో రాష్ట్రమిస్తే పార్టీని విలీనం చేస్తానని సోనియాకు ఇచ్చిన మాటపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయటంవల్ల రెండు పార్టీలూ కోరుకుంటున్న మేలు జరుగుతుందా లేక విలీనం వల్ల ప్రత్యర్థి పార్టీలకు మేలు జరుగుతుందా అనేది చూడాలంటూ కాంగ్రెసు పెద్దల వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇందుకు సంబంధించి దిగ్విజయ్ సింగ్‌తో చర్చోపచర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల మద్దతు ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెరాసలను మాత్రమేనని, ప్రజలు ఓట్లు వేయాలనుకుంటే వీటికే వేస్తారని కెసిఆర్ భావిస్తున్నారు.

ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తే, బిజెపి లేదా తెలుగుదేశం తమకు ప్రత్యర్థి పార్టీలు అవుతాయని, ఒకవేళ అవి పొత్తు పెట్టుకుంటే కొంత నష్టం జరుగుతుందని, అదే ప్రజల్లో ఉన్న ఆదరణ మేరకు కాంగ్రెస్, తెరాసలు వేర్వేరుగా పోటీ చేస్తే తెలంగాణలో ఉన్న 17 లోకసభ నియోజకవర్గాల్లో ఒకటి రెండు మినహా అన్నీ ఈ రెండు పార్టీలకే వస్తాయని కాంగ్రెసు పెద్దలకు చెబుతున్నారట.

అలాగాక విలీనం జరిగితే, ఒక ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశారని, రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఇచ్చారని టిడిపి చేస్తున్న వాదనను కొందరైనా నమ్మే అవకాశం ఉంటుందని, తద్వారా కొన్ని సీట్లు చేజారవచ్చునని, కాబట్టి తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం కంటే రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని, సీట్ల విషయంలో ఒక అవగాహనకు వస్తేనే బాగుంటుందని ఆయన చెబుతున్నారట.

అయితే, నిర్ణయాన్ని మాత్రం కాంగ్రెసు పార్టీ అధిష్టానానికే వదిలేశారని అంటున్నారు. విలీనమైతేనే మంచిదని తెరాసలోని ఓ వర్గంతో పాటు కాంగ్రెసు కూడా భావిస్తోందట. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వమే పొత్తులతో ఏర్పడితే, ఇబ్బందులు తలెత్తుతాయని, కుర్చీ కాపాడుకోవటంపై తప్ప అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించలేరని అంటున్నట్లు తెలిసింది. పునర్నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగాలంటే కేంద్రం స్థాయిలో మంచి పరిచయాలు, గుర్తింపు కలిగి రాష్ట్రంలోనూ అధికార యంత్రాంగంపై పట్టు, రాజకీయాలను అదుపు చేయగల సామర్థ్యం కలిగిన బలమైన నాయకుడు కావాల్సి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటికే ప్రజలకిచ్చిన అనేక హామీలను నిలబెట్టుకోవటంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని కాబట్టి, తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేసి, కెసిఆర్‌కే నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే, పునర్నిర్మాణం అనుకున్నట్లుగా చేసుకోవచ్చని చెబుతున్నారట. విలీనం, పొత్తులపై తెరాస నేతల అభిప్రాయాలను కూడా కెసిఆర్ తీసుకుంటున్నారు.

English summary
It is said that Telangana Rastra Samithi president K 
 
 Chandrasekhar Rao to meet Congress president Sonia 
 
 Gandhi to discuss about the future relations between 
 
 the two parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X