హిందూ ఆలయాన్ని నిర్మించిన ముస్లిం మతపెద్ద
మధుర: ఓ ముస్లిం మత పెద్ద తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. పదిమందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని ఆయన నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు చందాలు పోగుచేసి తన గ్రామంలోని హిందువుల కోసం ఓ దేవాలయాన్ని నిర్మించారు.
ఉత్తరప్రదేశ్లోని మధురకు సమీపంలో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వివరాల్లోకి వెళితే.. సహారా గ్రామంలో ఎక్కువమంది ముస్లింలు నివసిస్తుంటారు. గ్రామంలో హిందూ దేవాలయం లేకపోవడంతో హిందువులు చిన్నచిన్న పూజలకు కూడా సమీపంలోని ఇతర గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లేవారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామ ముస్లిం మతపెద్ద అజ్మల్ అలీషేక్.. గ్రామంలోనే హిందూ ఆలయాన్ని నిర్మించాలని తలచారు. అనుకున్నదే తడువుగా పనిని ప్రారంభించారు. ఇందుకోసం తన కష్టార్జితం రూ. 4 లక్షలతో పాటు పలువురి వద్ద చందాలు పోగుచేసి.. ఎనిమిది నెలల నుంచి ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు.
గత ఆదివారమే ఆలయంలో ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివుడు, హనుమాన్ తదితర హిందూ దేవుళ్లను ఆలయంలో ప్రతిష్టించారు. చిన్నాచితక పనులు మిగిలిపోయాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తానని మత పెద్ద అజ్మల్ అలిషేక్ చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications