templetirumalatiurmala kondabrahmostavamphotos
మహామహాతపశ్శక్తివంతులనుకునే వీరులుభీరువులై పారిపోతోంటే, ఉగ్రనరసింహమూర్తినిఆలింగనం చేసుకున్నది శ్రీమహాలక్ష్మీదేవి!సంపద, బంగారం మాత్రమేసమస్తమనుకుని విర్రవీగినహిరణ్యకశ్యపుడిని అసురసంధ్యవేళ వాకిలిగుమ్మం పైన చీల్చి చెండాడిన ఉగ్రనరసింహమూర్తితిరుమల త్రోవలో యోగనరసింహుడైనాడు.నరసింహుడి అంకంపైన కూర్చున్నభంగిమలో ఉండే లక్ష్మీదేవి కేవలంతిరుమల నడక దారిలో మాత్రం ఆలింగనభంగిమలో ప్రణయ యోగంలో ఉన్నారు.లక్ష్మీ సమాలింగిత వామభాగంగాప్రత్యేకత పొందారు. 1485 ఏప్రిల్ 20వ తేదీననృసింహ సార్వభౌముడు మెట్లదారిలోలక్ష్మీనరసింహులను ప్రతిష్టించారు.కఠినశిలతో పోటీ పడగల చేవ, భోరునకురిసే వర్షంలో సైతం దహనక్రియలోకోరలు సాచడం ఎర్రచందనం ప్రత్యేకత.కనీసం వెయ్యేళ్ళ వయస్సు గల ఎర్రచందనపుకంబం లక్ష్మీసమేత యోగనరసింహునిఆలయం పక్కనే ఉంది. ఈ కంబం మొదలుపైతదుపరి కాలంలో నరసింహరాయుడిని మలచారు.ఈ కంబపురాయునికి భక్తులు అణకువతోప్రేమతో ప్రదక్షిణలు చేస్తారు. స్వామి దీర్ఘరోగాలనునయం చేస్తారని, సంతానాన్ని ఇస్తారని కొందరుభక్తుల స్వానుభవం! మనసును అడుసునకంబం అంటారు కదా. అలా ఊగిసలాడే దుర్భలమనస్కులనుఎర్రచందనపు కంబపు నరసింహుడుదృఢనిశ్చయులను చేస్తుంటాడు.
- పుస్తకంపై ప్రముఖుల కామెంట్స్












Click it and Unblock the Notifications