తిరుమల కొండ
ద్వాపరయుగం తర్వాత శ్రీ మహావిష్ణువు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునిగాతిరుమలపై అవతరించారని ప్రజలువిశ్వసిస్తారు. ఇందుకు మహాభారతంలోని మౌసల పర్యాన్ని ఆధారంగాచూపిస్తారు. త్రిలోకాలను, త్రికాలాలను నిర్వహిస్తూనే శ్రీకృష్ణుడు గాఢయోగంలో వున్నారు.
దూర్వాసుడు యాదవులకు ఇచ్చిన శాపాన్ని శ్రీకృష్ణుడుఅమలు జరగనిచ్చారు. త్రేతాయుగంలో చెట్టుచాటుగా శ్రీరాముడువేసిన బాణంతో హతుడైన వాలి ద్వాపరంలో జర అనేబోయవానిగా జగన్నాటక రంగంపైకి వచ్చాడు.యోగనిద్రలో విశ్రమించిన శ్రీ కృష్ణుని పాదపద్మములనుతాను వేటాడ దలచిన జంతువుగా భావించి జర బాణం వేస్తాడు.
అదిశ్రీకృష్ణుని నిర్వాణానికి కారణమైంది. జరిగిన దానికిరోదిస్తున్న జరను ఓదార్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు భగవానుడు. భూలోకంనుంచి శ్రీదేవీ సమేతంగా ఊర్ధ్వ లోకాలకు వెళుతున్న శ్రీ కృష్ణునిమునిజనులు కీర్తిస్తారు. తమకు భూలోక వాసులకుముక్తి మార్గం చూపమంటారు.
చతుర్భుజుడై,జీవంతో తొణికిసలాడుతున్నా శ్రీకృష్ణుడు సూర్యబింబంమధ్యలో ప్రకాశిస్తుండగా....నేను ప్రస్తుతరూపంలో ఎక్కడ కనిపిస్తానో అక్కడ నివశిస్తాను..ఆ రూపాన్ని అర్చించండి అనిఅశరీర వాణి తెలియజేస్తుంది. స్వామి చెప్పిన ఆఅర్చావతారమే తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు.
- పుస్తకంపై ప్రముఖుల కామెంట్స్