వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజా కళాకారుడు వల్లం నర్సింహారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రజా కళాకారుడు, సినీనటుడు వల్లం నర్సింహారావు సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆయన ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన వల్లం నరసింహారావు 1952లో సినీ రంగ ప్రవేశం చేశారు. మా భూమి వంటి నాటకాల్లో నటించి ఆయన జైలు శిక్ష అనుభవించారు. కులదైవం, ముద్దుబిడ్డ సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. ఇంకా పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన మృతికి సినీరంగం సంతాపం ప్రకటించింది.
Comments
Story first published: Monday, March 13, 2006, 23:53 [IST]