PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!
పశ్చిమ ఆసియాలో యుద్ధం భారతదేశాన్ని ఉద్రిక్త పరిస్థితిలోకి నెట్టిందని ప్రధాని మోడీ (pm modi)ఇవాళ లోక్ సభలో చేసిన ప్రసంగంలో తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, తాము నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ, పౌరులకు సాయం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా పౌరులను రక్షించామన్నారు. ఇరాన్ నుండి 1000 మందికి పైగా భారతీయులను రక్షించామన్నారు. మధ్యప్రాచ్య దేశాలలోని విద్యార్థులకు సీబీఎస్ఈ కూడా పరీక్షలను రద్దు చేసిందని గుర్తుచేశారు.
భారతదేశం హార్ముజ్ జలసంధి ద్వారా పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, దీని ప్రభావం దేశ ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని తెలిపారు. మన ఇంధన అవసరాలలో సుమారు 60% దిగుమతి చేసుకుంటామని, సజావుగా సరఫరా జరిగేలా చూసేందుకు ఎల్పీజీ దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత 11 సంవత్సరాలలో భారత్ తన ఇంధన అవసరాల దిగుమతులను వైవిధ్యపరిచిందని, గత దశాబ్దంలో 27 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోగా, నేడు 41 దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 53 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని మోడీ తెలిపారు. మన రిఫైనరీ సామర్థ్యాలు కూడా పెరిగాయన్నారు. ఇంధనం, గ్యాస్, ఎరువుల అవసరాలను తీర్చుకోవడానికి కేంద్రం గల్ఫ్, హార్ముజ్ జలసంధిపై నిశితంగా దృష్టి సారిస్తోందన్నారు. ఈ రోజు ఇంధనం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, పశ్చిమ ఆసియా ప్రపంచ ఇంధన అవసరాలలో విస్తృతమైన వాటిని తీరుస్తోందని గుర్తుచేశారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి నిరంతరాయ అనుసంధానం కోసం భారత్ కృషి చేస్తోందన్నారు.. దిగుమతి, ఎగుమతి అవసరాలను రోజువారీగా సమీక్షించే ఒక అంతర్-మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మోడీ చెప్పుకొచ్చారు.
Speaking in the Lok Sabha. https://t.co/BIrR385m4O
— Narendra Modi (@narendramodi) March 23, 2026
తీరప్రాంత, సైబర్ భద్రతతో సహా అన్ని రంగాలలో భారతదేశం భద్రతపై దృష్టి సారిస్తోందని మోడీ తెలిపారు. కోవిడ్ కాలంలో మనం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నామని, అదేవిధంగా, పశ్చిమ ఆసియా యుద్ధం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని మోడీ కోరారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ వినియోగంపై వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
-
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీశక్తికి పట్టాభిషేకం -
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
"యుద్ద చరిత్ర తిరగరాసిన ఇరాన్"-జనసేన నేత ప్రశంసలు..! -
మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ -
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ











Click it and Unblock the Notifications