PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!
పశ్చిమ ఆసియాలో యుద్ధం భారతదేశాన్ని ఉద్రిక్త పరిస్థితిలోకి నెట్టిందని ప్రధాని మోడీ (pm modi)ఇవాళ లోక్ సభలో చేసిన ప్రసంగంలో తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, తాము నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ, పౌరులకు సాయం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా పౌరులను రక్షించామన్నారు. ఇరాన్ నుండి 1000 మందికి పైగా భారతీయులను రక్షించామన్నారు. మధ్యప్రాచ్య దేశాలలోని విద్యార్థులకు సీబీఎస్ఈ కూడా పరీక్షలను రద్దు చేసిందని గుర్తుచేశారు.
భారతదేశం హార్ముజ్ జలసంధి ద్వారా పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, దీని ప్రభావం దేశ ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని తెలిపారు. మన ఇంధన అవసరాలలో సుమారు 60% దిగుమతి చేసుకుంటామని, సజావుగా సరఫరా జరిగేలా చూసేందుకు ఎల్పీజీ దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత 11 సంవత్సరాలలో భారత్ తన ఇంధన అవసరాల దిగుమతులను వైవిధ్యపరిచిందని, గత దశాబ్దంలో 27 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోగా, నేడు 41 దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 53 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని మోడీ తెలిపారు. మన రిఫైనరీ సామర్థ్యాలు కూడా పెరిగాయన్నారు. ఇంధనం, గ్యాస్, ఎరువుల అవసరాలను తీర్చుకోవడానికి కేంద్రం గల్ఫ్, హార్ముజ్ జలసంధిపై నిశితంగా దృష్టి సారిస్తోందన్నారు. ఈ రోజు ఇంధనం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, పశ్చిమ ఆసియా ప్రపంచ ఇంధన అవసరాలలో విస్తృతమైన వాటిని తీరుస్తోందని గుర్తుచేశారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి నిరంతరాయ అనుసంధానం కోసం భారత్ కృషి చేస్తోందన్నారు.. దిగుమతి, ఎగుమతి అవసరాలను రోజువారీగా సమీక్షించే ఒక అంతర్-మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మోడీ చెప్పుకొచ్చారు.
Speaking in the Lok Sabha. https://t.co/BIrR385m4O
— Narendra Modi (@narendramodi) March 23, 2026
తీరప్రాంత, సైబర్ భద్రతతో సహా అన్ని రంగాలలో భారతదేశం భద్రతపై దృష్టి సారిస్తోందని మోడీ తెలిపారు. కోవిడ్ కాలంలో మనం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నామని, అదేవిధంగా, పశ్చిమ ఆసియా యుద్ధం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని మోడీ కోరారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ వినియోగంపై వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు? 10 కిలోల ప్లాన్తో సామాన్యులకు ఊరట -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
హోటల్స్ కు గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోటా పెంపు -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు















Click it and Unblock the Notifications