మళ్లీ తెగబడ్డ పాక్.. ముగ్గురు సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు
మంగళవారం ఉదయం నుంచి కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యానికి పాక్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో.. ముగ్గురు భారత సైనికులు మరణించారు.
మచల్ : పాక్పై భారత సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత.. తొలిసారిగా భారత సైన్యానికి ఎదురుదెబ్బ తగలింది. మంగళవారం ఉదయం నుంచి కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యానికి పాక్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో.. ముగ్గురు భారత సైనికులు మరణించారు. వీరిలో ఒక సైనికుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి తమ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు పాక్ ఉగ్రవాదులు.

మచల్ సెక్టార్ వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. కాగా, దీనికి తీవ్రమైన ప్రతీకారం తప్పదని భారత ఆర్మీ పాక్ ను హెచ్చరించింది. సైనికుల మృతదేహాలను పాక్ ముక్కలుగా చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ హయాంలోను ఓ సైనికుడి తలను నరికి పాక్ ఉగ్రవాదులు తమ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదేమైనా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడి నియంత్రణ రేఖ వెంబడి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు పాక్ ఉగ్రవాదులు.
More From
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications