అవును, చంద్రబాబు నాయుడు కన్వీనర్ అయితే తప్పేంటి?: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా స్పందించారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం ఓ కమిటీ వేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం నాడు చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ చేశారు. పరిణామాల పైన చర్చించారు. అనంతరం ఐదుగురు ముఖ్యమంత్రులతో కమిటీ వేయాలనుకుంటున్నట్లు, దానికి నేతృత్వం వహించాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అనంతరం మంగళవారం కమిటీ వేసారు. చంద్రబాబు నేతృత్వం వహిస్తారు.

చంద్రబాబు కన్వీనర్ కాకముందే, ఈ విషయమై విలేకరులు ముఖ్యమంత్రి కేసీఆర్ను అడగగా ఆయన స్పందించారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాల పైన ఓ కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించిందని, దానికి చంద్రబాబును నేతృత్వం వహించాలని కేంద్రం కోరిందని, దీనిపై ఏమంటారని విలేకరులు అడిగారు.
దానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఐదుగురు ముఖ్యమంత్రులతో కమిటీ వేయడంలో తప్పేమిటని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాగా, ఓటుకు నోటుతో ఇరువురి మధ్య విభేదాలు, ఆ తర్వాత కొంతకాలానికి సానుకూలత కనిపిస్తోన్న విషయం తెలిసిందే.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications