రాయలసీమ ప్రగతికి డాలస్లో GRADA అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో, ఏప్రిల్ 13, 2025న ఫ్రిస్కో, టెక్సాస్లో ఒక ముఖ్యమైన, ఆలోచన రేకెత్తించే సమావేశం జరిగింది. మన ప్రియమైన రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు, దాని అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అలాగే మన తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చించడమే ఈ
సమావేశ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రముఖులు శ్రీ భూమన గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు. మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉం టుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.












Click it and Unblock the Notifications