భారత ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త చెప్పిన సత్య నాదెళ్ల- మోదీతో భేటీ తర్వాత అనూహ్య నిర్ణయం
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల.. భారత్ లో ప్రత్యక్షం అయ్యారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. అత్యంత భారీ పెట్టుబడిని ప్రకటించారు. దీని విలువ 17.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీతో పోల్చుకుంటే సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. AI-first future ప్రాజెక్ట్ లో భాగంగా సత్య నాదెళ్ల ఈ ఇన్వెస్ట్ మెంట్ పెట్టనున్నారు. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన వెంటనే ఈ విషయాన్ని ప్రకటించారు.
మోదీతో జరిగిన భేటీలో Artificial Intelligenceపై చర్చించారు. దేశంలో దాదాపు అన్ని విభాగాల్లోనూ AIని విస్తృతంగా వినియోగిస్తోన్న ప్రస్తుత పరస్థితుల్లో దీన్ని మరింత విస్తరించడానికి గల అవకాశాలు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం- సత్య నాదెళ్ల తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను దీనికి జత చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారాయన. దేశంలో ఏఐ విస్తరించడానికి గల అవకాశాలపై విస్తృతంగా చర్చించామని, ఈ దిశగా తమ ఇద్దరి మధ్య స్ఫూర్తిదాయకమైన సంభాషణ జరిగిందని సత్య నాదెళ్ల వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో భాగంగా భారత్ లో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టబడులు పెట్టనున్నామని వెల్లడించారు. ఆసియా దేశాల్లో ఇదే తమ అతిపెద్ద పెట్టుబడి అవుతుందని వ్యాఖ్యానించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఈ రంగంలో దేశం పూర్తి సార్వభౌమత్వాన్ని సాధించడానికి తమ పెట్టుబడి సహాయపడుతుందని సత్య నాదెళ్ల తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. AI లో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూపులు సారిస్తాయని, ఈ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు త్వరలోనే వస్తాయని వ్యాఖ్యానించారు.
Thank you, PM @narendramodi ji, for an inspiring conversation on India’s AI opportunity. To support the country’s ambitions, Microsoft is committing US.5B—our largest investment ever in Asia—to help build the infrastructure, skills, and sovereign capabilities needed for… pic.twitter.com/NdFEpWzoyZ
— Satya Nadella (@satyanadella) December 9, 2025
మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ఈ పెట్టుబడుల వల్ల వచ్చే అవకాశాలను యువత అందిపుచ్చుకుంటుందని, మెరుగైన ప్రపంచం కోసం AI ని ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, AI నైపుణ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం వివిధ రంగాలలో సురక్షిత డేటా వ్యవస్థలకు వ్యూహాత్మకంగా బలోపేతం చేయడంపై మైక్రోసాఫ్ట్ దృష్టి సారించే అవకాశం ఉంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications